20, జులై 2011, బుధవారం

పెట్రోల్ ధర మండుతుంది ఎడ్లు కట్టండి

   ప్రపంచం అంతా సబ్సిడీ రహితంగా ఉంటే మనం ఇంకా పాత పద్దతుల్లోనే పోతున్నాం అని చిరాకు పడతారు. పోటీ ప్రపంచంలో సబ్సిడీలేంటని ప్రశ్నిస్తారు. ఇదంతా చూస్తున్న జనాలకు కూడా సిగ్గేసి ఎవడి ముష్టో మనకెందుకు పెంచితే పెంచారులే అనుకుని ముందుకుపోతారు. అలా ఇప్పుడు లీటర్  పెట్రోల్  70 రూపాయల 60 పైసలుకు తీసుకొచ్చారు. మన పొరుగునే ఉన్న పాకిస్తాన్ లో మాత్రం లీటర్  పెట్రోల్  కేవలం 30 రూపాయలే. బంగ్లాదేశ్ లో అయితే 28 రూపాయలే. నేపాల్ లో 40 బర్మాలో 35 రూపాయలు నడుస్తోంది.

   కమ్యునిస్ట్   క్యూబాలో అయితే లీటర్  పెట్రోల్ కేవలం 22 రూపాయలు మాత్రమే. నిత్య ఆందోళనల ఆఫ్ఘనిస్తాన్ లో కూడా లీటరు పెట్రోల్  44 రూపాయలే. కతార్ లో 36 రూపాయలు. ఇదంతా చూస్తుంటే మన పాలకుల మీద కోపం రావడం లేదూ. ఇప్పుడు అసలు విషయం చూద్దాం. అంతర్జాతీయ క్రూటాయిల్  ధరలు అంటూ మాట్లాడుతుంటారు కదా...అసలు లీటర్  పెట్రోల్  సరఫరా ధర లీటర్ కు 20 రూపాయల యాభై పైసలు. దీని మీద కేంద్ర పన్ను 13రూపాయలు. ఎక్సైజ్  డ్యూటీ 10 రూపాయల డెభై అయిదు పైసలు. రాష్ట్ర పన్నులు 15రూపాయలు. వాట్  ఆరు రూపాయల ముఫై పైసలు. వెరసి 71రూపాయల అరవై పైసలు. మనకు సరఫరా అవుతున్న పెట్రోల్  మీద లీటర్ కు మూడున్నర రెట్లు అధిక ధరకు మనకు అందిస్తున్నారన్నమాట. ఈ పన్నులు, సెస్ లు తగ్గించుకోగలిగితే సగం తగ్గించుకున్నా పెట్రోల్  దర సామాన్యుడికి ఇంత భారం అవదు.

  ప్రతిపక్షాలు కూడా పెట్రోల్ ధరలు తగ్గించాలని ఆందోళనలు మాని నిర్దిష్టంగా ప్రభుత్వం పెట్రోల్  మీద విధిస్తున్న పన్నుల విధానాన్ని రద్దు చేయాలని ఆందోలనలు చేస్తే ప్రయోజనం ఉంటుంది. జనం పెరిగిన ధరలకు అలవాటు పడే దాకా ఆందోళనలు చేసి విరమించడం కాకుండా పన్నుల విధానాన్ని శాస్త్రీయంగా మదింపు వేస్తూ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురాగలిగితే ప్రజలకు మేలు చేసిన వాళ్లవుతారు.-hmtv సౌజన్యంతో

నా వ్యాఖ్య : పెట్రోల్ పూల్ ని తొలగించి పుణ్యం కట్టుకుంది బి జే పి.  సందు దొరికింది కాబట్టి ఏనుగునే దూర్చేస్తాం అంటూ కాంగ్రెస్ అనగా యుపిఏ సర్కార్. పన్నులను తగ్గించాలని మొదటి నుండి పట్టు పట్టింది మార్క్సిస్టు పార్టీ మాత్రమె. మార్క్సిస్టు నాయకులు ఎప్పుడో దీన్ని గురించి రాసారు. పార్లమెంటులో ప్రజల పక్షాన నిలబడే పార్టీ ని ఓడించి, కంపెనీలు చెప్పినట్లు ఆడే పార్టీలకు అధికారం కట్ట పెడితే పరిస్థితులు ఇలా నే ఉంటాయి మరి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి