8, అక్టోబర్ 2010, శుక్రవారం

(అ)రాజకీయనాయకులు

ఈ మధ్య ఎవరి నోట విన్నా 'వెధవ' రాజకీయాలనేవారే. రాజకీయ నాయకులు తప్పితే ఎవరు కూడా ప్రస్తుత రాజకీయాలను ఇష్టపడటంలేదు. ఆ రాజకీయ నాయకులు కూడా ఇంకో పార్టీ లోకి మారినప్పుడు, తను అప్పటిదాకా ఎలోచ్చిన పార్టీ రాజకీయాలు కూడా నచ్చవు. ఇప్పుడు వేరే పార్టీ లోకి వచ్చి పవిత్రుడైపోయినట్లు మాట్లాడుతారు.

ఏదో కారణం చేత పార్టీ నుండి బహిష్కరించపడినట్లయితే, అప్పటిదాకా తాను నమ్మిన సిద్దాంతాన్ని కూడా లెక్క చేయకుండా, పార్టీ మీద, పార్టీ నాయకుల మీద బురద పోస్తారు. బురద కాని దొరకకపోయిండా, వేరే నాయకుల దగ్గరనుండి బురదని అరువుతెచ్చుకోనైనా పోయడానికి సిద్ధ పడతారు. తను నమ్మిన సిద్ధాంతాలను వదిలేసి, అప్పటిదాకా శత్రువుగా భావించిన వాళ్ళ ఎదుట ఎంచక్కా భజన చేయటానికి సిద్ద పడతారు.

ప్రజలు 'ఛీ' 'ఛా' అన్నా, పనిలేని, పనికి రాని పరమ సున్టలన్నా, తమ పని తాము కానిచ్చుకుని పోతూనే ఉంటారు. ప్రజలతో వాళ్ళకేమి పని, మరో ఎన్నికల దాకా. మీజోలికి మేము రాము, మా జోలికి మీరు రావద్దంటారు.

ప్రజలు బుద్ధిగా వాళ్ళు చెప్పిన మాటలు సరదాగా వింటారు. పాపం, ఎన్నికలప్పుడు పెట్టిన ఖర్చు ఎలా వస్తుందని, రాజకీయ నాయకులపైనే జాలి చూపిస్తారు. ఎలక్షన్లప్పుడు తీసుకున్న దానికి కృతజ్ఞత చూపిస్తారు.

రాజకీయాలను ఎవగించుకుంటూనే, రాజకీయాలు అలా మారటానికి కేటలిస్టులు గా పని చేయటాని కి ఇష్టపడుతుంటారు.

ప్రస్తుత రాజకీయాలను మారుద్దమనుకునే వాళ్ళని మాత్రం పిచివాళ్ళ లాగా చూస్తూ, మీరు గెలిచినా వాడినా ప్రజలకోసం పని చేస్తుంటారు కాబట్టి, ఆ చేసే పనేదో బైటే వుండి చేయమని వాళ్ళని తుక్కు తుక్కుగా వోడిస్తారు.

ప్రత్యామ్నాయ రాజకీయాలు మనకెందుకు. గానుగేద్దుల్ల మనం ఆ సాంప్రదాయ పార్టీల చుట్టే తిరుగుదాము. మనలో వున్నా చివరి రక్తపు బొట్టు వరకు మన (అ) రాజకీయనాయకుల అబివ్రుద్దికే దారపోద్దము.